న్యూఢిల్లీ : ఇకపై మోసాలు చేసే ఈ కామర్స్ సంస్థలపై ఫిర్యాదు చేయడం సులభంగా మారింది. నోడల్ ఆఫీసర్ నియామకానికి సంబంధించిన నిబంధనలు కంపెనీలకు వర్తిస్తాయని, విదేశాల్లో నమోదై కంపెనీలు కూడా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఫిర్యాదుల కోసం నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఈ నెల 17 నుండి అమల్లోకి వచ్చింది.
కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం.. అన్ని ఈ-కామర్స్ కంపెనీలు వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి తప్పనిసరిగా ఒక నోడల్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, సంప్రదింపు వివరాలను వెబ్సైట్లో ఇవ్వాలి. వినియోగదారుడు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును అందుకున్నట్లు వెబ్సైట్ 48 గంటల్లోపు సమాధానం ఇవ్వాలి. ఈ ఫిర్యాదును కూడా ఒక నెలలోనే పరిష్కరించాల్సి ఉంటుంది.
కన్స్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 2020 కింద ఉన్న ఈ కొత్త నిబంధన ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని అమలు చేయడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించే నిబంధన కూడా దీనిలో పొందుపరిచారు.
ఎవరైనా వస్తువులు, సేవల గురించి ఫిర్యాదు చేయవచ్చు. మీరు కొనుగోలు చేసిన ఏదైనా వస్తువులో ఏదైనా ఫిర్యాదు ఉంటే లేదా మీరు సేవలతో సంతృప్తి చెందకపోతే, మీరు దాని కోసం ఫిర్యాదు చేయవచ్చు. నోడల్ అధికారి నియమాకం భారతదేశంలో నమోదు చేసుకున్న అన్ని ఈ-కామర్స్ కంపెనీలకు వర్తిస్తుంది. ఈ నిబంధన విదేశాల్లో నమోదు చేసుకున్న సంస్థలకు కూడా వర్తిస్తుందని, అయితే అవి భారతీయ వినియోగదారులకు వస్తువులు, సేవలను అందిస్తే మాత్రమే అని ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనలను నిర్ధారించడానికి నోడల్ ఆఫీసర్ భారతదేశంలోనే ఉండాలి.
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
మరో చిప్కో ఉద్యమం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’
బ్రిటన్ అన్లాక్ : కలకలలాడుతున్న ఎయిర్పోర్ట్స్, రెస్టారెంట్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..