వాషింగ్టన్ : అరుణ గ్రహంపై ‘మర్మమైన రాయి’ ని నాసా రోవర్ కనుగొన్నది. దీని ఆధారంగా మార్స్పై జీవులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతారు. నాసా ప్రయోగించిన పెర్సర్వెన్స్ రోవర్ అన్ని కార్యకాలపాలను ఇంగెన్యూటి అనే ఈ హెలికాప్టర్ గత 35 రోజులుగా నిశితంగా గమనిస్తోంది. ఇంగెన్యూటి అనే హెలికాప్టర్ అంగారక గ్రహం నుండి రోవర్ చేరుకోలేని ప్రదేశాల నుంచి డాటాను పొందేందుకు సహాయపడుతుంది.
రోవర్ మాస్ట్క్యామ్-జెడ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా దాని పరిసరాల హై రిజల్యూషన్ చిత్రాలను తీసింది. రోవర్ ద్వారా తీసిన ఈ చిత్రాలలో 45 కిలోమీటర్ల వెడల్పు గల జాగెరో బిలం రాళ్ళతో నిండి ఉండటాన్ని చూడవచ్చు. ఈ రాళ్ళు అంగారకుడిపై చాలా మిస్టీరియస్గా కనిపిస్తున్నాయి.
అగ్నిపర్వతం విస్ఫోటనం అనంతరం ఇలాటి రాళ్ళు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. జాగెరో బిలంతో బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక సరస్సు, డెల్టా ఉండి ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు, ధూళి, ఇసుక నిక్షేపణ కారణంగా అవక్షేపణ శిలలు కాలక్రమేణా ఏర్పడతాయని కూడా చెప్తున్నారు.
నాసా రోవర్ రెండు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉన్నది. మొదటి లక్ష్యం అంగారక గ్రహంపై జీవుల జాడలను కనుగొనడం కాగా, రెండవ లక్ష్యం అనేక నమూనాలను సేకరించడం. ఈ రాళ్లను కూడా సేకరణలో చేర్చవచ్చు. ఈ పురాతన మార్స్ పదార్థాన్ని నాసా, యూరోపియన్ అంతరిక్ష సంస్థ సంయుక్త యాత్ర ద్వారా భూమికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2031 నాటికి ఈ రాళ్లను భూమిపైకి తెచ్చే అవకాశం ఉన్నదని పసాదేనాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కెన్ ఫార్లే తెలిపారు.
జూన్ 1 నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం
పాలస్తీనాకు అన్ని రకాల సాయం: పాక్ నిర్ణయం
మరో చిప్కో ఉద్యమం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’
బ్రిటన్ అన్లాక్ : కలకలలాడుతున్న ఎయిర్పోర్ట్స్, రెస్టారెంట్స్
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేయాలన్న పిటిషన్ తోసివేత
నటి మెర్కెల్ను వివాహమాడిన ప్రిన్స్ హ్యారీ.. చరిత్రలో ఈరోజు
బట్లర్ ఆల్టైమ్ ఐపీఎల్ XI లో ధోనీ, కోహ్లీ, శర్మకు చోటు
కోడి మెదళ్లు తిన్నా.. 111 ఏండ్లు బతికున్నా..!
కన్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ కనిపెట్టిండు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..