అహ్మదాబాద్ : గత రెండు రోజులుగా తౌటే తఫాను కారణంగా గుజరాత్లోని పలు ప్రాంతాలు కకావికలమయ్యాయి. అహ్మదాబాద్ జమాల్పూర్ ప్రాంతంలో బుధవారం ఓ ఐదంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాటి నష్టం జరుగలేదు. ఘటన జరుగడానికి ముందే నివాసితులంతా బయటికి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
తౌటే తుఫాను కారణంగా బలమైన గాలుల వీయడంతో జమాల్పూర్లోని ఓ నివాస భవంతి కూలిపోయింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో భవనం మొత్తం నానిపోయి కూలిపోయేందుకు సిద్ధమైందని స్థానికులు గుర్తించారు. దాంతో భవనంలో నివసిస్తున్న అందరినీ బయటకు తరలించారు. అందరూ బయటకు వెళ్లిన కొద్దిసేపటికే భవనం కుప్పకూలిపోయింది. దాంతో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు.
కాగా, గిర్ సోమనాథ్ జిల్లాలోని డియూ, ఉనా పట్టణం మధ్య మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. గుజరాత్లో తుఫాను సంబంధ ఘటనల్లో ఇప్పటివరకు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాను తీర ప్రాంతాలను తీవ్రంగా ధ్వంసం చేసింది. 69,000 విద్యుత్ స్తంభాలు, చాలా చెట్లు కూలిపోయాయి. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టాలపై ప్రభుత్వం సర్వే చేస్తుందని, తదనుగుణంగా సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాష్ట్ర పౌరులకు హామీ ఇచ్చారు.
నేపాల్లోని దౌలాఖా జిల్లాలో చైనా ఆక్రమణలు
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
జూన్ 1 నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం
పాలస్తీనాకు అన్ని రకాల సాయం: పాక్ నిర్ణయం
మరో చిప్కో ఉద్యమం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’
బ్రిటన్ అన్లాక్ : కలకలలాడుతున్న ఎయిర్పోర్ట్స్, రెస్టారెంట్స్
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేయాలన్న పిటిషన్ తోసివేత
నటి మెర్కెల్ను వివాహమాడిన ప్రిన్స్ హ్యారీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..