ఖాట్మండు : నేపాల్ దౌలాఖా జిల్లాలోని పలు ప్రాంతాలను తాజాగా చైనా ఆక్రమించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే నేపాల్లోని అనేక ఇతర సరిహద్దుల్లో చైనా ఇటువంటి కార్యకలాపాలు చేపట్టింది. అలాగే, నేపాల్ భూమిపై శాశ్వత నిర్మాణాలతోపాటు రహదారి పనులను కూడా చేపట్టింది.
నేపాల్ దౌలాఖా జిల్లాలోని వీగు గ్రామ శివారులో సరిహద్దు స్తంభాలు ఏర్పాటు చేసిన చైనా.. అనంతర కాలంలో వీగు గ్రామంలో శాశ్వత నిర్మాణాలు, రహదారి పనులను చేపట్టింది. చైనా చేపట్టిన ఈ చర్యపై నేపాల్ హోం మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. ఈ విషయంలో చైనాతో చర్చలు జరుపాలని నిర్ణయించింది.
అంతకుముందు 2020 సెప్టెంబర్లో చైనా సరిహద్దు జిల్లా హమ్లాలో నేపాల్ భూమిని ఆక్రమించి అక్కడ 11 భవనాలు, రోడ్లు నిర్మించారు. దీనికి నేపాల్ అభ్యంతరం చెప్పినప్పటికీ.. చైనా వీరిని పట్టించుకోలేదు. దీనిపై నేపాల్లో చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ఖాట్మండులోని చైనా రాయబార కార్యాలయం ముందు ప్రదర్శనలు చేపట్టిన ప్రజలు.. చైనా విస్తరణ వాదాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ కూడా నిరసన వ్యక్తం చేసినప్పటికీ సరిహద్దు ఆక్రమణ కొనసాగింది.
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
జూన్ 1 నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం
పాలస్తీనాకు అన్ని రకాల సాయం: పాక్ నిర్ణయం
మరో చిప్కో ఉద్యమం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’
బ్రిటన్ అన్లాక్ : కలకలలాడుతున్న ఎయిర్పోర్ట్స్, రెస్టారెంట్స్
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేయాలన్న పిటిషన్ తోసివేత
నటి మెర్కెల్ను వివాహమాడిన ప్రిన్స్ హ్యారీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..