హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర(Bus yatra) రెండో రోజు ప్రారంభమైంది. గురువారం సూర్యాపేట నుంచి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా గులాబీ బాస్ కేసీఆర్ భువనగిరి(Bhuvanagiri) చేరుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు భువనగిరిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్కు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డుషోలో పాల్గొంటారు.
కాగా, మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర వరుసగా కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు.