ముంబై: రైల్వే స్టేషన్లో చెత్త వేయడాన్ని ఒక వ్యక్తి సమర్థించుకున్నాడు. శుభ్రత కోసం రైల్వేకు మెయింటెనెన్స్ చెల్లిస్తున్నానని అన్నాడు. (Man justifies littering station) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి ముంబైలోని లోకల్ ట్రైన్లో ప్రయాణించాడు. గుట్కా తిన్న తర్వాత రేపర్ను రైలు కోచ్ విండో నుంచి స్టేషన్లోకి విసిరాడు. ఎదురుగా ఉన్న మరో ప్రయాణికుడు దీనిని గమనించి అతడ్ని నిలదీశాడు. అయితే తన చర్యను ఆ వ్యక్తి సమర్థించుకున్నాడు. రైల్వే స్టేషన్ శుభ్రత కోసం రైల్వేకు తాను మెయింటెనెన్స్ చెల్లిస్తున్నానని చెప్పాడు. దీంతో ‘మీకు అవార్డు ఇవ్వాలి’ అని ఎదురుగా ఉన్న వ్యక్తి అన్నాడు. ‘అవును నాకు అవార్డు ఇవ్వండి’ అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు.
కాగా, ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియో క్లిప్ను ఎక్స్లో పోస్ట్ చేశాడు. ‘మానసికంగా సరిగా లేని ఈ జంటిల్మ్యాన్ శుభ్రత కోసం రైల్వేకు మెయింటెనెన్స్ చెల్లిస్తున్నాడట. అందుకే స్టేషన్ను చెత్తమయం చేస్తాడట. ఇలా అయితే శుభ్రత మెరుగవుతుందా? ఇలాంటి ఇడియట్లను ఎలా డీల్ చేయాలి? ప్రయాణానికి అనుమతించకూడదు’ అని అందులో పేర్కొన్నాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వ్యక్తి తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి బుద్ధి చెప్పాలని కొందరు, కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు. రైల్వే కూడా ఈ వీడియో క్లిప్పై స్పందించింది. ఆ వ్యక్తి తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Sick mentality
This Gentleman gives maintenance to the @RailMinIndia to clean it and he will keep on doing filth and will not improve.
How to deal with such idiots. They don't deserve to travel.@Central_Railway @RailwaySeva @mumbairailusers @IndianRailUsers @swachhbharat pic.twitter.com/5YSvdJaWPQ
— d𝖍𝖆𝖗𝖒𝖊𝖘𝖍 b𝖆𝖗𝖆𝖎🇮🇳 (@dharmeshbarai) April 17, 2024