(Amaravathi Farmers) తిరుపతి: చిత్తూరు జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర రెండో రోజుకు చేరింది. గత 37 రోజులుగా రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ మరింత రెట్టింపు హుషారుతో అమరావతి రైతులు తమ పాదయాత్రను మొదలుపెట్టారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపడుతున్న ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పాదయాత్ర జగ్గరాజు వద్ద చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన షరతుల మేరకు తిరుపతి అర్బన్ పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ రైతులు తమ పాదయాత్రను కొనసాగించారు. శ్రీకాళహస్తిలో బస చేసేందుకు రైతులు స్థానిక కల్యాణమండపంలో ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, కొందరు నాయకుల ఒత్తిళ్ల మేరకు సదరు కల్యాణమండపం నిర్వాహకులు రైతులు బస చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం.
బుధవారం చింతలపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఊరందూరు వరకు సాగనున్నది. చింతలపాలెం నుంచి యాత్ర ప్రారంభం కాగానే మహిళా రైతులకు శ్రీకాళహస్తి వాసులు సారె పెట్టి గౌరవించారు. పసువు, కుంకుమ ఇచ్చి శాలువాతో సత్కరించారు. చింతలపాలెం వచ్చిన సీపీఐ నేత నారాయణ.. అక్కడ రైతులతో మాట్లాడి తన సంఘీభావం తెలిపారు. అన్నదాతలను వేధించడం సబబు కాదని, తిరుపతిలో సభ నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు అనుమతించకపోయినా తిరుపతిలో సభ నిర్వహించి తీరుతామని మహిళా రైతులు శపథం చేయడం విశేషం.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..