తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది టాలెంటెడ్ నటులను ఇచ్చిన షో జబర్దస్త్. అక్కడ్నుంచి వచ్చిన చాలా మంది ఇప్పుడు హాయిగా బతికేస్తున్నారు. వాళ్లకు బయట కూడా మంచి ఇమేజ్ ఉంది. లేడీ వేషాలు వేసే వాళ్లకు కూడా మంచి క్రేజ్నే ఉంది. జబర్దస్త్ లేడీ గెటప్లలో ఫేమస్ అయిన వారిలో వినోద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే వినోద్ బదులు వినోదిని అనాలేమో..? ఇప్పుడీ జబర్దస్త్ కమెడియన్ వినోద్ తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తన ఇంటి ఓనర్పై ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశాడు. రెండేళ్ల కింద ఇదే ఇంటి ఓనర్.. వినోద్పై భౌతిక దాడి చేసిన సంగతి తెలిసిందే.
అసలు విషయం ఏంటంటే తాను ప్రస్తుతం ఉంటున్న ఇంటిని రూ.40 లక్షలకు కొనుక్కోవడానికి బేరం కుదుర్చుకున్నాడు వినోద్. ఈ క్రమంలోనే 2019లోనే ఆయనకు రూ.13 లక్షలకు పైగా అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఇంటి ఓనరు ఆ ఇంటికి రూ.40 లక్షల కంటే ఎక్కువ ధర చెబుతున్నాడు. అంతకంటే ఎక్కువ ఇస్తేనే అమ్ముతానని లేదంటే.. ముందు ఇచ్చిన రూ.13 లక్షలు అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేది లేదు అంటూ వినోద్ ను బెదిరిస్తున్నాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. జబర్దస్త్ కమెడియన్ వినోద్ ఇదంతా ఆ వినతిపత్రంలో ఆయన రాసుకొచ్చాడు.
రెండేళ్ల కింద కూడా కావాలనే తనను ఇంటిపైకి పిలిపించి కొందరితో కలిసి మూకుమ్మడిగా దాడి చేశాడని ఆయన పోలీసులకు చెప్పాడు. ఇంటి అమ్మకం విషయంలో ఇది జరిగిందని తెలుస్తుంది. గతంలో ఇల్లు కొనుగోలు కోసం ప్రమీల, బాలాజీకు రూ.13 లక్షలు ఇచ్చామని.. వాళ్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకుండా.. డబ్బులు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. దాడి సమయంలో కూడా కూడా సెటిల్మెంట్ కు అని పిలిచి హత్యాయత్నం చేశారని వినతి పత్రంలో పేర్కొన్నాడు వినోద్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి