2021లో మోస్ట్ సర్ప్రైజింగ్ బ్లాక్బస్టర్స్లో ఒకటి జాతిరత్నాలు. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి రాణించింది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి అనుదీప్ దర్శకత్వంలో జాతి రత్నాలు సినిమాను నిర్మించాడు. టీజర్ విడుదలైనప్పుడే సినిమాపై ఆసక్తి పెరిగింది. ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచి సంచలన వసూళ్లు సాధించింది. రెండు వారాలు హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడింది జాతిరత్నాలు. ఉప్పెన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మళ్లీ కొత్త ఊపిరి పోసింది ఈ సినిమా. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. 25 రోజుల్లో దాదాపు రూ.40 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించారు జాతిరత్నాలు. చిన్న సినిమాల్లో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా రికార్డు సృష్టించింది జాతి రత్నాలు. ఈ సినిమాకు దాదాపు రూ.40 కోట్లకు పైగానే లాభాల వచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో థియేటర్లో మిస్ అయిన వాళ్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది.
మరో నాలుగు రోజుల్లో జాతిరత్నాలు మన ఇంటికి రాబోతున్నారు. ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్లో జాతిరత్నాలు సినిమా ప్రసారం కానుంది. దాంతో థియేటర్లో చూడలేకపోయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు జాతిరత్నాలు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అమెజాన్లో కూడా జాతిరత్నాలు రికార్డు వ్యూస్ సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. అవుట్ అండ్ అవుట్ ప్లాస్టర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమా చూస్తే సరిపోతుంది అని పదే పదే చెబుతున్నారు మేకర్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి