కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. సామాన్యులనే కాక సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడమని చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. కాని వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. తాజాగా ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత నగ్మా కరోనా బారిన పడ్డారు. కాస్త అనారోగ్యంగా అనిపించడంతో ఆమె.. పరీక్ష చేయించుకున్నారు. అందులో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఏప్రిల్ 2న తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, కొద్ది రోజులకే ఆమెకు కరోనా సోకడం ఇక్కడ గమనించాల్సిన అంశం.
కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని నగ్మ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సలహాలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నట్టు నగ్మా పేర్కొంది.త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. నగ్మా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటించి అగ్రశ్రేణి కథానాయికగా ఓ వెలుగు వెలిగిన విషయం విదితమే.