ఎవరైనా పెళ్లంటే పట్టుబట్టలో లేదంటే సూటో వేసుకుంటారు. కానీ ఈ పెండ్లికొడుకు మాత్రం చెడ్డీలో వచ్చి పెళ్లాడాడు. ఇదేమైనా ఆచారమా అంటే కానేకాదు. ఎందుకిలా పెండ్లికొడుకు చెడ్డీలో వచ్చాడని ఆరాతీసిన మీడియాకి షాకిచ్చింది పెండ్లి కూతురు. ఇండోనేషియాకి చెందిన సుప్రాప్తో , ఎలిండా డ్వీ క్రిస్టియానీల పెండ్లి ఏప్రిల్ 2న జరిగింది. అయితే వారం రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఈ పెండ్లి ఫొటోలు వైరల్ అయ్యాయి.
అందుకు కారణం కొత్త పెండ్లికొడుకు చెడ్డిలోనే పెండ్లిచేసుకోవడం. పెండ్లికి నాలుగురోజుల ముందు సుప్రాప్తో ప్రమాదానికి గురయ్యాడు. పెట్రోల్ కొట్టించుకునేందుకు బైక్పై వెళ్తుండగా సడెన్గా రోడ్డుమీద స్పృహ తప్పిపోయాడు. ఈ ప్రమాదంలో బాగా దెబ్బలు తగలడమే కాదు సర్జరీ కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పెండ్లి వద్దని చెప్పినా పెళ్లిపీటలెక్కాడు సుప్రాప్తో. అనుకున్న టైమ్ కి ఎలిండా డ్వీని పెండ్లాడి సోషల్ మీడియాని షేక్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
11న ‘మల్లన్న’ క్షేత్రంలో అగ్నిగుండాలు
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి