జైపూర్: కరోనా రెండో వేవ్తో ప్రపంచ దేశాలన్నీ.. ప్రస్తుతం భారత్ గడగడ వణికిపోతున్నది. ఆక్సిజన్ కొరత.. రెమ్డెసివిర్.. వెంటిలెటర్ కోసం రోగుల అగచాట్లు చెప్పనలవి కాదు.. కానీ రాజస్థాన్లోని నాలుగు గ్రామాలకు చెందిన 4,000 మంది గ్రామస్తులు మాత్రం ఇప్పటికి తమ గ్రామంలోకి కొవిడ్-19 అడుగు పెట్టకుండా జాగ్రత్త తీసుకుంటున్నాయి.
రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లా పరిధిలోని లింబాడియా గ్రామ పంచాయతీ కింద ఈ నాలుగు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామస్తులు బయటకు వస్తే మాస్క్లు ధరించాల్సిందే. భౌతిక దూరం పాటిస్తున్నారు. నెల రోజులుగా వివాహాది వేడుకలు నిలిపివేశారు.
ఈ నాలుగు గ్రామాల్లోని మెజారిటీ ప్రజలు కార్మికులు, వ్యవసాయ కార్మికులే. కానీ, వారంతా కొవిడ్-19 మార్గదర్శకాలను ఎంతో శ్రద్ధగా పాటిస్తున్నారు. దుంగార్పూర్ జిల్లాలోని గలియాకోట్ పంచాయతీ సమితికి 8 కి.మీ దూరంలో ఈ గ్రామాలు ఉన్నాయి. లింబాడియా గ్రామ పంచాయతీ పరిధిలోకి లింబాడియా, ధేబారియా, గడియా, రతన్పురా పల్లెలు ఉన్నాయి.
లింబాడియా గ్రామ పంచాయతీలో 4,288 మంది ప్రజలు ఉన్నారు. వారిలో అత్యధికులు చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులే. దాదాపు వారంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
ప్రభుత్వ, వైద్యశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధుల సమగ్ర ప్రయత్నాల వల్ల గ్రామస్తుల మధ్య గొప్ప అవగాహన కలిగిందని దుంగార్పూర్ జిల్లా పరిషత్ సీఈవో అంజలీ రాజోరియా చెప్పారు. దీనివల్ల ఇప్పటి వరకు ఈ నాలుగు గ్రామాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు గానీ, ఒక్క మరణం గానీ చోటు చేసుకోలేదు.
శానిటైజేషన్ ప్రాముఖ్యతను మహిళలతో జరిగే సమావేశాల్లో సవివరంగా అవగాహన కల్పించామని గ్రామ సర్పంచ్ నర్మదాదేవి తాబియాడ్ చెప్పారు. ఈ నాలుగు గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి కోర్ కమిటీ పని చేస్తున్నది.
ఇప్పటి వరకు ఇన్ఫ్లూయెంజా లక్షణాలు కల ఏడుగురు వ్యక్తులకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 28 మంది వలస కార్మికులను క్వారంటైన్ చేశారు. పలు దఫాల కౌన్సెలింగ్, అవగాహన ప్రచారోద్యమాలతో ఈ నాలుగు గ్రామాల ప్రజలు అత్యధికంగా వివాహాలు వాయిదా వేసుకున్నారు.
Amazon miniTV: అమెజాన్ మినీ టీవీ లాంచ్.. పూర్తిగా ఉచితం
మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. స్మార్ట్ఫోన్ వచ్చింది!
బ్రిటన్ వైపు ఇండియన్ సంపన్నుల చూపు.. నిపుణులు కూడా..!
Corona టైం..పరిమళించిన మానవత్వం: అంబులెన్స్ డ్రైవర్గా ఎన్నారై
ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ ఎఫ్డీ కన్నా బెటర్
పరపతికి గీటురాయి సిబిల్ స్కోర్
సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!
బంగారం vs క్రిప్టో కరెన్సీ.. పెట్టుబడికి ఏది బెస్ట్? గోల్డ్కే ఇండియన్ల మొగ్గు!!
అక్షయ తృతీయకు డిమాండ్ లేకున్నా.. పెరిగిన బంగారం దిగుమతులు
ఎయిరిండియా ప్రైవేటీకరణ ఈ ఏడాది డౌటే!
కొవిడ్ దెబ్బ: ఆతిథ్య రంగానికి రూ.1.30 లక్షల కోట్ల నష్టం!!
Corona virus : కరోనాపై తొలి నుంచీ అయోమయమే.. అసలు ఎందుకింత గందరగోళం