Hyderabad | సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): మహానగరంలో భానుడు మండిపోతున్నాడు. వరుసగా మూడో రోజు కూడా పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటి నమోదుకావడంతో ప్రజలు ఎండ వేడి..ఉక్కపోతతో అల్లాడిపోయారు.
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 43.1, కనిష్ఠం 28.4, గాలిలో తేమ 15 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నగరంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సాధ్యమైనంత వరకు పగటి వేళ.. బయటకు రావొద్దని సూచిస్తున్నారు.