హైదరాబాద్, మే 4: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్.. అక్షయ తృతీయ ఆఫర్లను ప్రకటించింది. దీంట్లోభాగంగా డైమండ్స్ను కొనుగోలు చేసినవారికి రూ.2 వేల విలువ కలిగిన వోచర్ను ఉచితంగా అందిస్తున్న సంస్థ..రూ.50 వేల కంటే అధిక విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినవారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్ను ప్రకటించింది.
అలాగే రూ.10 వేల కలిగిన వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన వారికి రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్ను అందిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న జోయాలుక్కాస్ షోరూంలలో ఈ నెల 12 వరకు ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయని జోయాలుక్కాస్ గ్రూపు సీఎండీ జోయ్ అలూక్కాస్ తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్లు కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయన్నారు.