Porsche | కోల్కతా, మే 4: స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. థర్డ్ జనరేషన్ పనమెరా మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.1,69,62,000(కోల్కతా షోరూంలో ధర). ఈ సందర్భంగా పోర్షే ఇండియా బ్రాండ్ డైరెక్టర్ మనోలిటో వ్యూజిసిస్ మాట్లాడుతూ..జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని భారత్లో విక్రయిస్తుండటంతో ధర అధికంగా ఉన్నదని, ముఖ్యంగా దిగుమతి సుంకాలు అధికంగా ఉండటంతో ఈ భారం కొనుగోలుదారులపై మోపాల్సి వస్తున్నదన్నారు.
భారత్లో అల్ట్రా-లగ్జరీ కార్ సెడాన్ మార్కెట్ భారీగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్నారు. 2.9 లీటర్ ట్విన్-టర్బో వీ6 ఇంజిన్ కలిగిన ఈ మాడల్ గంటకు 272 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 5.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు. ప్రస్తుతం సంస్థకు ఢిల్లీ, ముంబైతోపాటు కోల్కతాలో రిటైల్ అవుట్లెట్ ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ ఏఎంజీ, బీఎండబ్ల్యూ ఎం8 గ్రాన్ కౌప్లకు పోటీగా సంస్థ ఈ మాడల్ను ప్రవేశపెట్టింది.