రవీంద్రభారతి, ఆగస్టు 13: కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, భూకబ్జాదారుల దోపిడీ పాలన అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. భూకబ్జాలకు పాల్పడుతున్నవాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. గురువారం బషీర్బాగ్ దేశోద్ధ్దారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా తారామతిపేటలో అధికారులు, ఎమ్మెల్యే ఒక్కటై బీసీల భూములు కబ్జా పెడుతూ భయభ్రాంతు 24 గంటల్లోగా తారామతిపేటలో భూకబ్జాలకు పాల్పడిన అగ్రకులాలవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రధాన అనుచరుడు కొత్తపల్లి జైపాల్రెడ్డి అరాచకాలకు అంతేలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తాటికొండ విక్రమ్గౌడ్, భూ యజమని నందనూరి కిరణ్సాగర్, శ్యాంకర్మా, కులకచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.