మొయినాబాద్, మే 4 : బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి కోరారు. శనివారం మండల పరిధిలోని మేడిపల్లి, రెడ్డిపల్లి, చందానగర్, అప్పోజిగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.
కాంగ్రెస్ నేతలు అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటి అమలును మరిచిపోయారని పేర్కొన్నారు. పార్లమెంట్ అభ్యర్థి కాసానిని గెలిపించుకుందామని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీకాంత్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ అంజయ్య, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జయవంత్, సుధాకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు ఎంఏ రవూఫ్, రాజు, వెంకట్రెడ్డి, మేడిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశ్, సీనియర్ నాయకులు తిరుపతిరెడ్డి, బాల్రాజ్, రమేశ్, రాజు, రాములు, యాదగిరిచారి, భాస్కర్, శ్రీరాములు, సురేశ్ పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల పరిధిలోని గ్రామాల్లో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని, మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శనివారం మండల పరిధి అల్లవాడ, అనుబంధ గ్రామం జాలాగూడలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ.. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్రాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివనీలచింటూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, సర్పంచ్ల సంఘం మాజీ మండల అధ్యక్షుడు శివారెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, మాజీ సర్పంచ్లు సులోచనాఅంజన్గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మహేశ్, నాయకులు రామాగౌడ్, విఠల్రెడ్డి, శేరి రాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : కాంగ్రెస్ పార్టీని నమ్మి మరోసారి మోసపోయి ఆగం కావొద్దని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మాజీ చైర్మన్ నారాయణ అన్నారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దుతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అరోపించారు. కారు గుర్తుకు ఓటు వేసి కాసానిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింటు, మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, నాయకులు రాంబాబు, పాండు తదితరులు పాల్గొన్నారు.