న్యూఢిల్లీ: బంగారం అంటే ఇష్టం ఎవరికి ఉండదు.. అందునా భారతీయ వనితలైతే బంగారం అంటే ప్రాణం పెడతారు.. దేశీయంగా డిమాండ్ పెరగడంతో ఏప్రిల్ నెలలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత నెలలో 630 కోట్ల డాలర్ల విలువైన బంగారం దేశంలోకి దిగుమతి అయ్యింది. మరోవైపు వెండి దిగుమతులు 2.83 మిలియన్ల డాలర్లకు (రూ.21.61 కోట్లు) తగ్గుముఖం పట్టాయి.
ఫలితంగా కరంట్ ఖాతా లోటు (క్యాడ్) గతేడాది (2020-21)తో పోలిస్తే గత ఏప్రిల్లో 6.76 బిలియన్ డాలర్ల నుంచి 15.1 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. దేశమంతా కరోనా సెకండ్ వేవ్ వల్ల అల్లకల్లోలం అవుతున్నా దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగిపోవడం గమనార్హం.
అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజు.. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ కరోనాను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. కఠినమైన ఆంక్షల నేపథ్యంలో కస్టమర్ల సెంటిమెంట్పై ప్రతికూల ప్రబావం పడింది.
సాధారణంగా అక్షయ తృతీయ నాడు 30-40 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. కానీ ఈ ఏడాది ఒక టన్ను కూడా దాటలేదు. ఇదిలా ఉంటే డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం తర్వాత దేశీయ కరంట్ ఖాతా లోటు పెరగడం ఇదే తొలిసారి.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బంగారం దిగుమతి దారు భారత్. ఏప్రిల్ నెలలో 3.4 బిలియన్ల డాలర్ల జ్యువెల్లరీ అండ్ జెమ్స్ ఎగుమతులు జరిగాయి కానీ గతేడాది ఏప్రిల్లో లాక్డౌన్ వల్ల తీవ్ర ప్రభావం పడింది.
ప్రతిఏటా 800-900 టన్నుల బంగారం దిగుమతి అవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతానికి తగ్గించి, వ్యవసాయ మౌలిక వసతుల అభివ్రుద్ధి సెస్ 2.5 శాతం పెంచారు.
ప్రధాని మోదీపై పోస్టర్లు.. 17 మంది అరెస్టు
అనిల్కి షాక్ భారత్కు స్విస్ వివరాలు
కెయిర్న్ చేతికి ఎయిర్ ఇండియా విదేశీ ఆస్తులు?
ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు!
Amazon miniTV: అమెజాన్ మినీ టీవీ లాంచ్.. పూర్తిగా ఉచితం
మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. స్మార్ట్ఫోన్ వచ్చింది!
ఎల్లుండి నుంచి హీరో బైకుల ఉత్పత్తి ప్రారంభం
గుంటూర్ జిల్లాలో దారుణం.. భార్య గొంతుకోసిన భర్త
లాక్డౌన్ ఉల్లంఘనుల నుంచి రూ 28 లక్షల జరిమానా వసూలు!
హెచ్-4 వీసాదారులకు గూగుల్ మద్దతు
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న బిగ్ బీ
13 రోజులు ప్రధానిగా వాజ్పేయి.. చరిత్రలో ఈరోజు
ఒడిశాలో షూటింగ్లపై నిషేధం..!
బ్రిటన్ వైపు ఇండియన్ సంపన్నుల చూపు.. నిపుణులు కూడా..!
రేపు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు
యూపీలో దారుణం: కొవిడ్-19 రోగి కుటుంబంపై కాల్పులు?!