మహబూబాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ ఐదో రోజు కొనసాగుతున్నది. ఈ సందర్భంగా మహబూబూబాద్ జిల్లాలో లాక్డౌన్ అమలు తీరును మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మహబూబాబాద్లోని కూరగాయల మార్కెట్లో పర్యటించారు. ప్రతిఒక్కరు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వ్యాపారులకు సూచించారు. కూరగాయల మార్కెట్ రోడ్ నుంచి ముత్యాలమ్మ గుడి వరకు నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం మోడల్ మార్కెట్ నిర్మించే స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈనెల 12 నుంచి 10 రోజులపాటు అమలులో ఉండనుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం కల్పించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి