న్యూఢిల్లీ: కరోనా బారినపడి కన్నుమూస్తున్న జర్నలిస్టుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. సీనియర్ జర్నలిస్టు, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ మేనేజింగ్ ఎడిటర్ సునీల్ జైన్ కరోనాతో మరణించారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో కొన్నిరోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం కన్నుమూశారు. సునీల్ జైన్.. ప్రముఖ పత్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్ గిరిలాల్ జైన్ కుమారుడు.
సునీల్ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి