న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఎండీసీలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 15 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ఛత్తీగఢ్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 59
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16, టెక్నీషియన్ అప్రెంటిస్ 13, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (పాసా) 30 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్ ఇంజినీరింగ్లో బీటెక్ చేసి ఉండాలి.
టెక్నీషియన్ పోస్టులకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అండ్ టెలీకమ్యూనికేషన్, మైనింగ్, మోడ్రన్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్ అండ్ అప్లికేషన్ కోర్సుల్లో డిప్లొమా చేయాలి.
పాసా పోస్టులకు.. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో వొకేషనల్ ట్రైనింగ్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ క్వాలిఫికేషన్లో మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్ (ఈ-మెయిల్). నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి ఈ-మెయిల్ చేయాలి.
దరఖాస్తులు ప్రారంభం: మే 14
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
ఈ-మెయిల్: bld5hrd@nmdc.co.in
వెబ్సైట్: https://www.nmdc.co.in/