న్యూఢిల్లీ, మే 15: దేశంలో జూలై మాసాంతం నాటికి 51.6 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల వైద్యశాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతున్నామని, ఆ మేరకు జూలై నాటికి దేశవ్యాప్తంగా 51.6 కోట్ల మందికి టీకా వేయిస్తామని అన్నారు. ప్రస్తుతం దేశంలో 18 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. ఆగస్టు-డిసెంబర్ మధ్య కాలంలో 216 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి కానున్నాయని హర్షవర్ధన్ తెలిపారు.