న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే మ్యాట్- 2021 (మే సెషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ప్రవేశపరీక్ష ద్వారా బిజినెస్ స్కూల్స్ (B- స్కూల్స్)లోని ఎంబీఏ, అనుబంధ ప్రోగ్రామ్లలో అడ్మిషన్స్ చేపడటారు. దేశవ్యాప్తంగా సుమారు 600 బిజినెస్ స్కూల్స్ MAT స్కోర్ పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ ప్రవేశపరీక్షను 50 పైగా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రతి ఏడాది నాలుగుసార్లు నిర్వహిస్తారు.
అర్హత: డిగ్రీలో ఉత్తీర్ణత, చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: పేపర్ బేస్డ్ పరీక్ష (పీబీటీ), కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (సీబీటీ) ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు తమకు ఇష్టమైన విధానంలో పరీక్ష రాయవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.1650, పీబీటీ, సీబీటీ రెండు విధానాల్లో పరీక్ష రాయలనుకునేవారు.. రూ.2750 చెల్లించాలి.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా
పేపర్ బేస్డ్ పరీక్ష (పీబీటీ)
దరఖాస్తులకు చివరి తేదీ: మే 24
హాల్టిక్కెట్ డౌన్లోడ్: మే 26
పరీక్ష తేదీ: మే 30
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (సీబీటీ)
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 7
హాల్టిక్కెట్ డౌన్లోడింగ్: జూన్ 10
పరీక్ష తేదీ: జూన్ 13
వెబ్సైట్: https://mat.aima.in/may21