అసలే కరోనాతో దేశం అతలాకుతలం అవుతుంటే.. బ్లాక్ఫంగస్ అనే మరో వ్యాధి మరింత భయభ్రాంతులను చేస్తున్నది. ముఖ్యంగా, కరోనా చికిత్స పొంది దాని నుంచి కోలుకున్నవారిలో, లేదా, కరోనాకు చికిత్స తీసుకుంటున్న వారిలో ఈ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బ్లాక్ఫంగస్కు సంబంధించిన లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలతో ఒక గ్రాఫిక్ను రూపొందించి విడుదల చేసింది. దాంట్లో ఉన్న వివరాలు..
ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ, ఔషధాలు తీసుకుంటున్నవారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల ప్రమాదకరమైన సూక్ష్మజీవుల నుంచి వారికి రక్షణ ఉండదు. ఈ విధంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడినవారిపై మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ఫంగస్) క్రిములు దాడి చేస్తాయి.
లక్షణాలు..
కళ్ల చుట్టూ, ముక్కు చుట్టూ ఎర్రగా కావటం, నొప్పి జ్వరం, తలనొప్పి, దగ్గు, సమస్యలు రక్తపు వాంతులు , మానసికస్థితిలో బ్యాలెన్స్ కోల్పోవటం
దారి తీసే కారణాలు
నియంత్రణలో లేని మధుమేహం, స్టెరాయిడ్ల వాడకం వల్ల రోగనిరోధకశక్తి క్షీణించటం, ఐసీయూలో దీర్ఘకాలంపాటు చికిత్స తీసుకుంటూ ఉండటం, అవయవ మార్పిడి తర్వాత దశ (పోస్ట్ ట్రాన్స్ప్లాంట్), క్యాన్సర్, వొరికొనజోల్ చికిత్స
రాకుండా కాపాడుకోవటం ఎలా?
ఎప్పుడు అనుమానించాలి?
ఏం చేయాలి?
ఏం చేయొద్దు?