హైదరాబాద్: నగరంలోని కుల్సుంపురాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కుల్సుంపురాలోని జియాగూడ వెంకటేశ్వరనగర్ కాలనీలో దుండగులు ఐదు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా దొంగలు ఐదు ఇళ్లలో రూ.20 లక్షల నగదు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలనికి చేరుకున్నారు. చోరీ జరిగిన ఇళ్లలో క్లూస్ టీమ్తో పరిశీలిస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదుచేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి