నల్లగొండ: జిల్లాలోని నకిరేకల్ బైపాస్లో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నకిరేకల్ దవాఖానకు తరలించారు. మృతుడిని రవి (50)గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..