FSSAI | ఇటీవల భారత్కు చెందిన ప్రముఖ మసాలాలకు చెందిన ఉత్పత్తులను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయా మసాలాల్లో పురుగుల మందు అవశేషాలతో పాటు హానికరమైన బ్యాక్టీరియా ఉన్నాయన్న నివేదికలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే, ఈ వ్యవహారంపై దేశీయ ఫుడ్ సేఫ్టీ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ దర్యాప్తు చేపట్టింది. ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెర్బ్స్ అండ్ స్పైసెస్లో అధిక స్థాయిల్లో పురుగుమందుల అవశేషాలను అనుమతించినట్లుగా వస్తున్న కథనాలను ఖండించింది. ఆయా వార్తలన్నీ తప్పని పేర్కొంది.
భారత్ ప్రపంచంలో అత్యంత కఠినమైన గరిష్ఠ అవశేషాల పరిమితి (MRL) ప్రమాణాలను పాటిస్తున్న దేశాల్లో ఒకటని స్పష్టం చేసింది. ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిస్క్ అసెస్మెంట్ ఆధారంగా వివిధ ఆహార పదార్థాలకు పురుగుమందుల ఎంఆర్ఎల్స్ వేర్వేరుగా నిర్ణయించబడతాయని స్పష్టం చేసింది. అదే సమయంలో, పురుగుమందుల ఎంఆర్ఎల్స్ వేర్వేరు ఆహార పదార్థాలకు.. వాటి ప్రమాద అంచనా ఆధారంగా విడివిడిగా నిర్ణయించబడతాయని పేర్కొంది. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా పురుగుమందుల చట్టం, 1968 ప్రకారం.. ఏర్పాటైన సెంట్రల్ పెస్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (CIB&RC) ద్వారా భారతదేశంలో పురుగుమందులు నియంత్రించబడుతున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.
సీబీఐ-ఆర్సీ పురుగుల మందు తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, నిల్వ మొదలైన వాటిని నియంత్రిస్తాయి. పురుగుమందుల అవశేషాలను పరిశోధించడానికి ఏర్పడిన ఎఫ్ఎస్ఎస్ఏఐ శాస్త్రీయ ప్యానెల్ సీబీఐ, ఆర్సీ నుంచి వచ్చిన డేటాను పరిశీలిస్తుంది. ఆ తర్వాత, ఎంఆర్ఎల్స్ అన్ని ప్రమాద సంబంధిత డేటాను పరిశీలించిన తర్వాత నిర్ణయించబడాయి. ఈ సమయంలో భారతదేశ ప్రజల ఆహారం, అన్ని వయసుల ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలను సైతం దృష్టిలో ఉంచుకుంటారు. సెంట్రల్ పెస్టిసైడ్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీలో కొన్ని పురుగుమందులు నమోదయ్యాయి. ఉదాహారణకు రిస్క్ అసెస్మెంట్ ఆధారంగా బియ్యానికి కిలోకు 0.03 మిల్లీగ్రాములు, సిట్రస్ పండ్లు కిలోకు 0.2 మిల్లీ గ్రాములు, కాఫీ గింజలు కిలోకు 0.1 మిల్లీ గ్రాములు, ఏలకులు కిలోకు 0.5 మిల్లీగ్రాములు తదితర ఎంఆర్ఎల్స్ కలిగిన అనేక పంటలపై మోనోక్రోటోఫాస్ ఉపయోగించేందుకు అనుమతి ఉంటుంది.