IPL 2024 : పదిహేడో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు బౌలింగ్ కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. తాజాగా మరో స్పీడ్స్టర్ మథీశ పథిరన (Matheesha Parhirana) గాయం కారణంగా స్వదేశానికి బయల్దే రనున్నాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు మెరుగైన చికిత్స కోసం శ్రీలంక విమానం ఎక్కనున్నాడు.
డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసే ఈ యార్కర్ కింగ్ లేకపోవడం చెన్నైకి పెద్ద లోటే. పథిరన మళ్లీ భారత్కు ఎప్పుడు వస్తాడు? ఎల్లో జెర్సీ బృందంతో ఎప్పుడు కలుస్తాడు? అనేదానిపై సీఎస్కే మేనేజ్మెంట్ స్పందించలేదు. అయితే.. పథిరన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ మాత్రం పెట్టింది.
🦁🚨 OFFICIAL ANNOUNCEMENT 🦁🚨 #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) May 5, 2024
పదహారో సీజన్తో పథిరన ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. జూనియర్ మలింగగా పేరొందిన ఈ కుర్రాడు తన పవర్ఫుల్ యార్కర్లతో వారెవ్వా అనిపించాడు. ధోనీ కెప్టెన్సీలో రాటుదేలిన పథిరన 19 వికెట్లతో చెలరేగి చెన్నై ఐదో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 17వ సీజన్లో పథిరన కేవలం ఆరు ఇన్నింగ్స్ల్లోనే 7.68 ఎకానమీతో 12 వికెట్లు తీశాడు.