తుర్కియేకు మానవతా సాయం అందించే ఐఏఎఫ్ ఏడో కార్గో విమానం ఆదివారం అదానా చేరుకున్నది. ఆపరేషన్ దోస్త్లో భాగంగా తుర్కియేకు 13 టన్నుల వెంటిలేటర్లు, మందులు, బ్లాంకెట్లు తీసుకొచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య కాన్పు చేసుకునేందుకు రష్యా గర్భిణులు అర్జెంటీనా వెళ్తున్నారు. మంచి వైద్యంతో పాటు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసమే ఇలా వెళ్తున్నామని వారు చెప్తున్నారు.
వలసదారులకు వ్యతిరేకంగా నార్త్ వెస్ట్ ఇంగ్లండ్లో ఆందోళనలు జరిగాయి. ఈ సంఘటనలో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వలసదారులను అందరినీ నిందించడం సరికాదని నోస్లీ ఎంపీ జార్జ్ హోవర్త్ చెప్పారు.
జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తంగళ్ళపల్లి మండలం
గోపాల్ రావు పల్లె లో మునిగే ఎల్లయ్య తన పశువుల కొట్టెంలో కట్టేసిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపివేసింది.
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా అబ్దుల్ నజీర్ నియమకమయ్యారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్ నజీర్ను ఏపీ గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
వారంతపు సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని విసన్నపేట మండలం అడ్డరోడ్డు వద్ద కారును లారీ ఢీ కొట్టింది. కారులో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
బ్రిటన్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ బాంబును మంగళవారం కనుగొని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పేలిపోయింది.
ఒకాయా ఈవీ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ప్రైస్ రూ.99,999. యాంటీ థెఫ్ట్ సిస్టం ఉండటం ఈ స్కూటర్ గొప్ప ఫీచర్.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తర్వాత మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇంట్లో రహస్య డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఈ నెపాన్ని న్యాయ శాఖపైకి నెట్టేందుకు పెన్స్ చూస్తుండటం విశేషం.
వివాహ శుభ కార్యక్రమానికి వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు నల్లగొండ జిల్లాలో ఈతకు వెళ్లి కాల్వలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
జీవన విధానంలో ఎదురయ్యే ఆరోగ్య ఇబ్బందులను గుర్తించి వాటిపట్ల అవగాహన కల్పించుకుంటే జబ్బుల నుంచి రక్షణ కల్పించుకోవచ్చని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అన్నారు.