అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా అబ్దుల్ నజీర్ నియమకమయ్యారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్ నజీర్ను ఏపీ గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ను చత్తీస్ గఢ్ గవర్నర్గా బదిలీ చేశారు. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన అబ్దుల్ నజీర్ గత నెల జనవరి 4న పదవీ విరమణ చేశారు.
వివాదస్పద బాబ్రీ మసీద్- అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో అబ్దుల్ నజీర్ సభ్యునిగా ఉండటం గమనార్హం. అంతేకాకుండా ట్రిపుల్ తలాఖ్ కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన సభ్యునిగా ఉన్నారు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బిశ్వభూషణ్ను 2019 జూలై 17న ఏపీ గవర్నర్గా నియమించారు. దాదాపు మూడున్నర ఏండ్ల పాటు ఆయన గవర్నర్గా సేవలందించారు.