MP keshineni Chinni | తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ధకాలం దాటిన తర్వాత కూడా రాష్ట్రంలో ఆంధ్రా నేతల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. ఏపీ నేతలు హైదరాబాద్లో భూ కబ్జాకు తెరలేపుతున్న ఘటనలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఏపీ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని హైదరాబాద్లో భారీ విలువైన భూ కబ్జాకు ప్లాన్ చేశాడన్న వార్త చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వేల కోట్ల విలువైన 112 ఎకరాల IT పార్క్ స్థలం కబ్జాకు యత్నం చేసినట్టు కేశినేని నాని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రగతి నగర్ – శాంషీగూడలో ఐటీ కారిడార్ విస్తరణ కోసం TGIICకి కేటాయించిన అత్యంత విలువైన 112.72 ఎకరాల భూమిని కేశినేని చిన్ని కుటుంబ సభ్యుల బినామీ నెట్వర్క్ M/s ఎక్సెల్లా ప్రాపర్టీస్ ద్వారా ఆక్రమించేందుకు యత్నిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సర్వే నెంబర్ 57 లోని భూమి పూర్తిగా పోరంబోకు సర్కారీ (ప్రభుత్వ భూమి) అని కలెక్టర్ తేల్చినా ల్యాండ్ గ్రాబింగ్ ఆగకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
హైదరాబాద్లో భూ కబ్జాకు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ప్లాన్
వేల కోట్ల విలువైన 112 ఎకరాల IT పార్క్ స్థలం కబ్జాకు యత్నం
సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కేశినేని నాని
ప్రగతి నగర్ – శాంషీగూడలో ఐటీ కారిడార్ విస్తరణ కోసం TGIICకి కేటాయించిన అత్యంత విలువైన 112.72 ఎకరాల భూమిని… pic.twitter.com/x6NbBM0sDw
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2026
Road accident | ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం
Sonu Sood | అయోధ్య విరాళాల వివాదంపై స్పందించిన సోనూ సూద్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్!