Road accident : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేదారిపుట్టుగ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు పంపింది. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.