హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ ,పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసన మండలిలో బండ ప్రకాశ్ను డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు అభినందనల తీర్మానంపై మంత్రి మాట్లాడారు. వెనుకబడిన వర్గాలను రాజకీయం, సామాజికం, ఆర్థికంగా చేయూత నిచ్చి బీసీలకు అండగా నిలబడుతున్నారని ప్రశంసించారు.
బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న బండా ప్రకాశ్ను డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రైతుబంధు సహా అనేక పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా ఉంటుందని అన్నారు. బలహీన వర్గాలకు వెయ్యికి పైగా గురుకులాలు, వేల కోట్ల విలువైన స్థలాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు. రాజకీయంగానూ ముదిరాజ్, రజక, నేత, యాదవ, కాపు, గౌడ, బీసీల్లోని సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తున్నారన్నారు.
బీసీల అభ్యున్నతికి బీసీ ప్రతినిధులు మరింత కృషి చేయాలని కోరారు. వెనుకబడిన వర్గాల కోసం తపించే బండ ప్రకాశ్ అత్యున్నతమైన డిప్యూటీ చైర్మన్ పదవిని అధిష్టించడం సంతోషంగా ఉందని మంత్రి అభినందనలు తెలిపారు.