అమరావతి : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని విసన్నపేట మండలం అడ్డరోడ్డు వద్ద కారును లారీ ఢీ కొట్టింది. కారులో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విపన్నపేటకు చెందిన ఓ కుటుంబం తెనాలిలో పెళ్లికి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదానికి లోనయ్యింది. ఈ ఘనటలో కారులో ఉన్న గుప్తాలాల్(45), సునీత మృతి చెందారు.
సునీత భర్త రాంబాబు పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.