గ్రేటర్లో 14వ రోజు 274 కేంద్రాల్లో 30,173 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 7992 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 4114 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. వాటిని నూతన ఆవిష్కరణలవైపు మళ్లించేందుకు కృషి చేయాలని సూచించారు.
Sahith Mangu | అమెరికాలోని న్యూజెర్సీలో ఓ తెలుగు కుర్రాడు అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రతిష్టాత్మక గార్డెన్ స్టేట్ డిబేట్ లీగ్ టోర్నమెంట్లో తన ప్రసంగాలతో అదరగొట్టి, విజేతగా నిలిచాడు.
మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చేపట్టిన చెరువుల సుందరీకరణతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాలీబాల్ ఆటలో హైదరాబాద్కు ఘనమైన వారసత్వముందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి అద్భుత ప్రతిభ కల్గిన ప్లేయర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించారని పేర్కొన్నారు.
మన రాజధానిలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం చాలా సంతోషించాల్సిన అంశమని, హైదరాబాద్లో క్రీడల వృద్ధికి అత్యంత కీలకంగా మారిందని, వాలీబాల్ క్రీడలో అద్భుతంగా రాణించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫాలితాలు ఇస్తున్నది. పట్టణ, పల్లె ప్రకృతి వనాలు(పార్క్లు) ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
8 ఏండ్ల కిందట హైదరాబాద్ పాతబస్తీకి, ఇప్పటి పాతబస్తీకి తేడా గమనించాలని, స్వల్పకాలంలోనే అద్భుత ప్రగతి సాధించిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఉద్దెమర్రి వైన్స్ వద్ద జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నేరం చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నాంపల్లి రెడ్ రోస్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సిటీ జాబ్ ఫేర్కు విశేష స్పందన లభించింది. జంటనగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు
murder | నగర పరిధిలోని బోయినపల్లిలో స్థిరాస్తి వ్యాపారి మహమ్మద్ సిద్ధిఖీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపారి బార్కస్కు చెందిన ఫైజుద్దీన్ అనే వ్యక్తి హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు.