హైదరాబాద్, డిసెంబర్ 16: ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్..హైదరాబాద్లో మరో ఆఫీస్ను ప్రారంభించబోతున్నది. ప్రస్తుతం హైటెక్ సిటీలో ఉన్న కార్యాలయంలో 3,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా… కొత్తగా ఏర్పాటు చేసే ఆఫీస్ కోసం 400 నుంచి 500 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో శ్రీకాంత్ నాదెళ్ల తెలిపారు.
వచ్చేవారంలో ఐపీవోకి వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఆర్థిక సేవలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వచ్చే 12-18 నెలల్లో 500 మంది సిబ్బందిని రిక్రూ ట్ చేసుకోనున్నట్లు చె ప్పారు. ఈ నెల 19న ప్రారంభం కానున్న ఐపీ వో 21న ముగియనున్నది. జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన వాటాను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్నారు. ప్రస్తుతం సంస్థలో ప్రమోటర్లకు 74.37 శాతం వాటా ఉండగా, కొటక్ మహీంద్రా బ్యాంక్కు 9.98 శాతం వాటా ఉన్నది.