హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన ఇంటర్ విద్యార్థి సర్వేశ్ప్రభు (17) అద్భుతం చేశాడు. ఇక్రిశాట్లో పరిశోధనలు నిర్వహించి, రాంఫల్ (రామసీతాఫలం) ఆకులతో తక్కువ ఖర్చుతో సేంద్రియ పురుగుమందును తయారు చేశాడు.
ఈ బయో పెస్టిసైడ్ పలురకాల తెగుళ్లపై 78-88 శాతం కచ్చితత్వంతో అద్భుతంగా పనిచేసినట్టు పరిశోధనలో తేలి ంది. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సదస్సులో దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. సర్వేశ్ప్రభును మూడో బహుమతితోపాటు వెయ్యి డాలర్ల ప్రైజ్మనీ వరించింది. అలాగే, ఈ సేంద్రియ పురుగుమందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ గుర్తింపును ఇచ్చింది.