హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం నిమిత్తం ఈ నెల 12వ తేదీన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మద్దతు వెల్లువెత్తింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు.. కేసీఆర్ను కలిసి తాము బీఆర్ఎస్తో కలిసి పనిచేయటా నికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తనను కలిసిన వారందరినీ కేసీఆర్ పేరుపేరునా పలుకరించి, వారితో ఫోటోలు దిగారు.