హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మాతాశిశు సంరక్షణకు అమలుచేస్తున్న ఉత్తమ విధానాలపై రాష్ట్రానికి బుధవారం కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.
దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన మిడ్ వైఫరీ వ్యవస్థకు ప్రత్యేక బహుమతి రాగా, హైరిస్ కేసుల గుర్తింపులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకొన్న వైద్య బృందం గురువారం మంత్రి హరీశ్రావును కలిసింది. రాష్ట్రం తరఫున అందుకొన్న అవార్డులను వారు ఆయనకు అందజేశారు. ఈ సందర్బంగా వైద్య సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జేడీ (మెటర్నల్ హెల్త్) డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.