కరకగూడెం, ఆగస్టు 01 : కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన యువ నాయకుడు జాడి రవి తండ్రిగారైన జాడి మెంగయ్య ఇటీవల ఆరోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు జాడి మెంగయ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం దశదిన కర్మలకు 50 కేజీల బియ్యాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు కుమ్మరి సమ్మయ్య, బుడగం రాము, మాజీ ఉప సర్పంచ్ అత్తె సత్యనారాయణ, కొండగొర్ల కోటి, పాయం కృష్ణ, కొండగొర్ల నరసింహారావు, కుమ్మరి కుమార్, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.