హైదరాబాద్, ఆట ప్రతినిధి: తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్ను హైదరాబాద్ జట్టు ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం రాజీవ్ గాంధీ స్టేడియంలో ముగిసిన పోరులో 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు.. 7 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ 395 పరుగులు చేయగా.. తమిళనాడు 510/4 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 258 పరుగులకు ఆలౌటైంది. తనయ్ (69), తన్మయ్ (46), రోహిత్ (45) రాణించారు.