బండ్లగూడ,డిసెంబర్ 15: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. డీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్గూడలోని గుమ్మకొండ కాలనీలో ఆంజనేయులు ఇంట్లో బుధవారం సాయంత్రం దొంగలు పడి 10 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ. 13 వేల నగదును చోరీ చేశారు.
భార్య రాత్రి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో లోపలి గదిని పరిశీలించింది. బీరువా విరగొట్టి ఉండటంతో భర్త ఆంజనేయులుకు తెలిపింది. పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీంతో రంగంలోకి దిగి పరిశీలించి కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.