హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లాలాగూడలోని రైల్వే హాస్పిటల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, హాస్పిటల్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 40
ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్ 16, ల్యాబ్ అసిస్టెంట్ 4, హాస్పిటల్ అటెండెంట్ 20 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్), సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా, పదో తరగతి లేదా ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. ఏప్రిల్ 1, 2021 నాటికి 18 నుంచి 54 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి.
జీతభత్యాలు: నర్సింగ్ సూపరింటెండ్కు రూ.44,900, ల్యాబ్ అసిస్టెంట్కు రూ.21700, హాస్పిటల్ అటెండెంట్కు రూ. 18 వేల చొప్పున ప్రతినెల చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: మే 15
వెబ్సైట్: www.scr.indianrailways.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి