వాషింగ్టన్ : అమెరికాలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. రోజువారి సగటు మరణాలు 600కు పడిపోగా.. పది నెలల కనిష్ఠానికి చేరాయి. సగానికిపైగా రాష్ట్రాల్లో మరణాలు జీరోకు చేరగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రెండంకెల కంటే దిగువకు చేరాయి. అలాగే రోజువారి కొవిడ్ కేసుల సగటు 38వేలకు చేరింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో పావు దాదాపు రెండున్నర లక్షల కేసులు ఉండగా.. ప్రస్తుతం 85శాతం తగ్గాయి. చివరిసారిగా జూలై ప్రారంభంలో ఇంత తక్కువగా మరణాలు నమోదయ్యాయని, దాదాపు సంవత్సరం క్రితం అమెరికాలో కొవిడ్ మరణాలు జనవరి నెల మధ్యలో రోజు సగటున 3,400 కన్నా ఎక్కువగా నమోదయ్యాయి.
గత నెల నుంచి అమెరికాలో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో వైరస్ కాస్త తగ్గుముఖం పడుతోంది. రోగ నిరోధక శక్తికి టీకాలు చాలా కీలకమని జాన్స్ హాస్పిన్స్ విశ్వవిద్యాలయంలోని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అమేశ్ పేర్కొన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. దేశంలో దాదాపు పెద్దవారికి 75 శాతం వ్యాక్సినేషన్ పూర్తవగా.. 58శాతం మందికిపైగా కనీసం ఒక మోతాదును తీసుకున్నారు. ఈ వారంలో ఫైజర్ కంపెనీ 12-15 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ఎఫ్డీఏ అనుమతి పొందింది. దీంతో తిరిగి పాఠశాలలు తిరిగి ప్రారంభించే పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు.