వరలక్ష్మి శరత్కుమార్, నవీన్చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్’ జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
దాదాపు 300 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశామని, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిందని, చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకుందని మేకర్స్ తెలిపారు. ఓటీటీలో కూడా ఈ సినిమా ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి పేర్కొన్నారు. ఎంఎస్కే ప్రమిద ఫిలిమ్స్ పతాకంపై బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించారు.