బెంగళూరు : కుంభమేళాకు వెళ్లొచ్చిన ఓ మహిళ.. మొత్తం 33 మందికి కరోనా అంటించింది. బెంగళూరుకు చెందిన ఓ 67 ఏండ్ల మహిళ ఉత్తరాఖండ్లో ఇటీవల జరిగిన కుంభమేళాకు వెళ్లొచ్చింది. అక్కడ్నుంచి వచ్చిన కొద్ది రోజులకే ఆమెకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. టెస్టు చేయించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ మహిళతో పాటు ఆమె కుటుంబంలోని మరో 18 మందికి కరోనా వ్యాపించింది.
సదరు మహిళా కోడలు.. వెస్ట్ బెంగళూరులోని స్పందన హెల్త్కేర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లో సైక్రియాటిస్టుగా పని చేస్తోంది. ఆ సెంటర్లో ఉన్న 13 మంది రోగులతో పాటు ఇద్దరు సిబ్బందికి సైక్రియాటిస్టు నుంచి కరోనా వ్యాపించింది. అలా మొత్తం 33 మందికి కరోనా సోకింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. 67 ఏండ్ల మహిళ నివాసంతో పాటు ఆ పరిసరాలను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..