న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వైరస్ కట్టడిలో కేంద్రం విఫలమైందంటూ ఆరోపించిన ఆయన.. తాజాగా గురువారం మరోసారి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మహమ్మారి సమయంలో టీకాలు, ఆక్సిజన్, మందులతో పాటు ప్రధాని కూడా కనిపించడం లేదు’ ఇక మిగిలినవి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, ఔషధాలపై జీఎస్టీ, అక్కడ ఇక్కడ ఉన్న ప్రధాని ఫొటోలు’ అంటూ ట్వీట్ చేశారు. రెండో దశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల కొరతపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.