Loksabha Elections 2024 : పశ్చిమ బెంగాల్లో టిఎంసి, కాంగ్రెస్ ఘర్షణ పడుతున్నట్టు నటిస్తున్నాయని, అయితే ఈ రెండు పార్టీల స్వభావం, సిద్ధాంతం ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మాల్దాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ సంతుష్టీకరణ కోసం ఈ రెండు పార్టీలు ఏం చేసేందుకైనా వెనుకాడవని అన్నారు.
దేశ భద్రత కోసం తాము తీసుకున్న నిర్ణయాలను తిరగతోడాలని ఇరు పార్టీలు కోరుకుంటున్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని ఇండియా కూటమి కోరుకుంటోందని, సీఏఏను రద్దు చేస్తామని టీఎంసీ చెబుతోందని ప్రధాని పేర్కొన్నారు. పేదల ఆస్తులను దర్యాప్తు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించిందని ఆరోపించారు. వారు విదేశాల నుంచి ఎక్స్రే మిషన్ను తీసుకొచ్చి దేశంలోని అందరిపై ఎక్స్రే చేపడతారని చెప్పారు.
మీ నగలు, ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని వాటిలో కొంత భాగం తమ ఓటు బ్యాంకుకు పంచాలని వారు భావిస్తున్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ వ్యాఖ్యలపై టీఎంసీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం దాల్చుతోందని మండిపడ్డారు. మీ భూములను టీఎంసీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులకు పంచేస్తే, కాంగ్రెస్ మీ ఆస్తులను తమ ఓటు బ్యాంక్కు పంచడం గురించి మాట్లాడుతోందని దుయ్యబట్టారు. మీ జీవితాంతం, మరణానంతరం కూడా కాంగ్రెస్ లూటీ కొనసాగుతుందని అన్నారు.
Read More :
ISRO Chief: ఓటేసేందుకు క్యూకట్టిన ఇస్రో చీఫ్.. వీడియో