తిరువనంతపురం: ఇస్రో చీఫ్(ISRO Chief) ఎస్ సోమనాథ్ ఇవాళ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన ఓటేశారు. తాజా సమాచారం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకు కేరళలో 31.06 శాతం పోలింగ్ జరిగింది. కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటల వరకు తిరువనంతపురంలో 23.72 శాతం, అట్టింగల్లో 26.03 శాతం, కొల్లామ్లో 23.82 శాతం, పాతానమిట్టలో 24.38 శాతం, మావెలిక్కరలో 24.56 శాతం, అలప్పుజాలో 25.28 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి.
#WATCH | ISRO chief S Somanath queues up along with other votes at a polling station in Thiruvananthapuram in Kerala #LokSabhaElections2024 pic.twitter.com/AbHmBnKXVd
— ANI (@ANI) April 26, 2024