లక్నో: బీహార్, తూర్పు యూపీలో గంగానదిలో శవాలు కొట్టుకువచ్చిన సమాచారంపై ఓ పక్క దర్యాప్తు జరుగుతుండగానే యూపీలోని ఉన్నావ్ జిల్లాలో రెండు చోట్ల అదే నది ఇసుకతిన్నెల కింద అనేక శవాలు బయటపడ్డాయి. ఆ ప్రదేశం యూపీ రాజధాని లక్నోకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇసుకలో కప్పెట్టిన అనేక శవాలకు కాషాయ గుడ్డలు చుట్టి ఉన్నాయి. స్థానికులు వాటిని దూరం నుంచి గమనించే ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
శవాలు బయటపడ్డ ఒక ప్రదేశం ఉన్నావ్తో సహా మూడు జిల్లాలకు శ్మశానంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతదేహాలు అన్నీ కూడా కోవిడ్ మరణాలకు సంబంధించినవి కాకపోవచ్చని వారు అంటున్నారు. కొన్నికులాలవారు శవాలను దహనం చెయ్యరని, నది ఉసుకలో శవాలను పూడ్చివేస్తారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
శవాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకంటామని ఆయన చెప్పారు. హిందువులు పవిత్రమైనదిగా భావించే గంగానదిలో శవాలు పారేసే ఆచారం ఏదీ లేదు. కలప దొరకని కారణంగా శవాలను ఆదరాబాదరాగా పూడ్చి ఉంటారని భావిస్తున్నారు. అందులో కొన్ని శవాలు ప్రవాహం ఎక్కువైనప్పుడు కొట్టుకుపోయి ఉండవచ్చని తెలుస్తున్నది.